శ్లోకం - 40

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః | ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మో௨భిభవత్యుత ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: వంశనాశనంతో పూర్వీకుల ధర్మాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన వంశమంతటా అధర్మం వ్యాపించును.