శ్లోకం - 6
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః | యానేవ హత్వా న జిజీవిషామః తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ యుద్ధం నందు ఎవరికి విజయం వరిస్తుంది అనేది తెలియదు. అలాగే యుద్ధం యొక్క ఏ ఫలితం మంచిది అనేది కూడా తెలియదు. దృతరాష్ట్ర కుమారులతో పాటు మన ఆత్మీయులు కౌరవ పక్షమున యుద్ధం చేయుటకు సిద్ధంగా ఉన్నారు.