శ్లోకం - 17

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ | వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరంలోని ఆత్మను నాశనం చేయలేమని తెలుసుకొనుము. ఈ విశ్వమంతా నిండిన శాశ్వతమైన ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు.