శ్లోకం - 30

దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత | తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా! ప్రతి ఒక్కరి శరీరం నందు ఉండే ఆత్మ శాశ్వతమైనది మరియు చావులేనిది. అందుచేత, నీవు ప్రాణుల గురించి దుఃఖించవలసిన అవసరము లేదు.