శ్లోకం - 35
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః | యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహారథులందరూ నీవు భయం చేతనే యుద్ధ రంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకుముందు వరకు నిన్ను గౌరవించిన వారందరూ ఇక నుండి చులకనగా చూస్తారు.