శ్లోకం - 61
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః | వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ ఇంద్రియాలపై పట్టును కలిగి ఉంటారో మరియు మనస్సును నా యందే స్థిరంగా ఉంచుదురో, వారి పరిపూర్ణ జ్ఞానము సుస్థిరమవుతుంది.