శ్లోకం - 20

కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః | లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జనకుడు మరియు ఇతర రాజులు నిర్దేశించిన కర్మలను అనుసరించి పరిపూర్ణతను సాధించారు. అందుచేత నీవు కూడా మానవాళికి ఆదర్శంగా ఉండడంతో పాటు లోకకల్యాణం కోసం నిర్దేశించిన కర్తవ్యములను నిర్వర్తించు.