శ్లోకం - 35
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరుల ధర్మము చక్కగా ఆచరించడం కంటే, లోపలతోనైనా స్వధర్మము పాటించడం మంచిది. ఏలా అంటే, మరోకరిలా నటించడం కన్నా మనం మన లాగే ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్వధర్మము నిష్ఠగా ఆచరించడంలో మరణమైనను శ్రేయస్కరం. పరుల ధర్మము ఆచరించడం ఎంతో భయంకరమైనది.