శ్లోకం - 10

వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః | బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనురాగం, భయం మరియు క్రోధం వంటి భావోద్వేగాలను విడిచిపెట్టి, నాయందే అంకితభావంతో స్థితులై ఉండి నన్నే ఆశ్రయించిన నా భక్తులు ఎంతో మంది ఉన్నారు. అట్టి వారు జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా దివ్య స్వరూపమును పొందారు.