శ్లోకం - 33

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప | సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, భౌతిక విశేషములు సమర్పించడంతో చేసే యజ్ఞం కంటే జ్ఞానముతో ఆచరించబడే యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది. ఎందుకంటే అన్ని కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తం అవుతాయి.