శ్లోకం - 35
యద్జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ | యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ జ్ఞానమును తత్వవేత్తల నుండి పొందిన తరువాత నిన్ను మోహం వశపరుచుకోలేదు. ఈ జ్ఞానంతో నీవు సమస్త జీవరాశులు భగవంతుని అంశములే అని గ్రహిస్తావు.