శ్లోకం - 7

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః | సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగాన్ని అభ్యసించే వారు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని జయించి, ఇంద్రియ సుఖములను అధిగమించి అన్ని జీవులలో ఉండే ఆత్మ, తమ ఆత్మ ఒకటేనని గ్రహిస్తారు. అట్టి వారు అన్ని కర్మలు చేసినా భౌతిక బంధాలలో చిక్కుకోరు.