శ్లోకం - 11

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః | నాత్యుచ్ఛ్రిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగాభ్యాసము చేయడం కోసం ఆసనంను తయారు చేసుకోడానికి పరిశుద్ధమైన ప్రదేశంలో ఒకదానిపై ఒకటి క్రమంగా దర్భలు పరచి, దానిపై జింక చర్మము, దానిపై వస్త్రంను ఎక్కువ ఎత్తులోగాని, తక్కువ ఎత్తులోగాని ఉండకుండా సరైన ఎత్తులో ఏర్పరచుకోవాలి.