శ్లోకం - 28
యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః | సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక విషయముల నుండి విముక్తి పొంది మరియు ఆత్మను భగవంతునితో ఏకం చేసిన యోగి ఎల్లపుడూ ఆత్మానుభవమును పొంది అనంతమైన ఆనందమును సునాయాసముగా పొందుచున్నాడు.