శ్లోకం - 32

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో௨ర్జున | సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని ప్రాణులలో భగవంతుడిని చూసే వారు, సుఖ దుఃఖములను సమానముగా చూసే వారు మరియు ఇతరుల సుఖ దుఃఖములను కూడా తమవాటిగానే భావించే యోగులను పరమశ్రేష్ఠులగా చెప్పబడుచున్నారు.