శ్లోకం - 23

అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ | దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అల్పబుద్ధి గల భక్తులు పొందే ఫలములు కూడా అల్పముగా ఉండును. ఇతర దేవతలను ఆరాధించేవారు మరణించిన తర్వాత ఆయా దేవతల లోకాలను పొందుతారు. నన్ను ఆరాధించేవారు నన్నే పొందుచున్నారు.