శ్లోకం - 5

అంతకాలే చ మామేవ స్మరన్‌ముక్త్వా కలేవరమ్ | యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే వారు నన్నే చేరుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు.