శ్లోకం - 28

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ | అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ రహస్యమును తెలుసుకున్న యోగులు, వేదపఠనము, యజ్ఞం, దానధర్మాలు, తపస్సు చేయడం వలన కలుగు పుణ్యఫలమును మించిన ప్రతిఫలాన్ని పొందుతారు. అట్టి యోగులు సర్వోన్నతమైన బ్రహ్మపదమును పొందెదరు.