శ్లోకం - 14
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః | నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొంతమంది భక్తులు దృఢసంకల్పముతో నిరంతరం నన్ను కీర్తిస్తూ, నన్ను చేరుటకు ప్రయత్నిస్తూ, అనన్య భక్తితో నాకు నమస్కరిస్తూ, నా ధ్యానమునందే నిమగ్నమై నన్నే ఆరాధిస్తున్నారు.