శ్లోకం - 25
యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః | భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినో௨పి మామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇతర దేవతలను ఆరాధించు వారు ఆయా దేవతలను పొందుతారు. పితృదేవతలను సేవించువారు పితరులను చేరుతారు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేతములనే పొందుతారు. నన్ను పూజించే వారు నన్నే పొందుతారు.