శ్లోకం - 34

మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు | మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే నీ మనస్సును ఉంచి, నా భక్తుడవై నన్నే పూజించుము. ఈ విధంగా నీ మనస్సు మరియు శరీరము నాకే అర్పించుటచే నన్నే పొందగలవు.