శ్లోకం - 24
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ | సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. జలాశయాల్లో సముద్రుడిని నేను.