శ్లోకం - 34
మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతామ్ | కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని జీవులను సంహరించు మృత్యువును నేను. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీ లక్షణములలో కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపకశక్తి, మేధస్సు, ధైర్యం, ఓర్పు నేను.