శ్లోకం - 21
అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణంతి | స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: దేవతలందరూ నీలోనే ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భయముతో చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. ఋషులు మరియు సిద్ధ పురుషులు పవిత్రమైన కీర్తనలు మరియు స్తోత్రములతో నిన్ను ప్రార్థించుచున్నారు.