శ్లోకం - 22

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః విశ్వే௨శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ | గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితృదేవులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులందరూ నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు.