శ్లోకం - 29

యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః | తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మిడుతలు తమ మరణానికి దారితీసే విధంగా మండుతున్న అగ్ని లోకి ప్రవేశిస్తున్నట్లుగా, ఈ గొప్ప వీరులందరూ కూడా తమ మరణానికై ఎంతో వేగంగా నీ నోళ్ళలో ప్రవేశించుచున్నారు.