శ్లోకం - 31

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమో௨స్తు తే దేవవర ప్రసీద | విజ్ఞాతు మిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ దేవ దేవుడా, నీకు నమస్కారములు. నన్ను అనుగ్రహించుము. ఉగ్ర రూపములో ఉన్న నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. సమస్త జగత్తుకి ఆదిపురుషుడవైన నీ గురించి మరింత తెలుసుకోవాలని నేను ఆసక్తిగా ఉన్నాను. మీ ప్రవృత్తి నాకు అస్పష్టంగా ఉంది.