శ్లోకం - 33
తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ | మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ సవ్యసాచీ(అర్జునా), పోరాడటానికి సిద్ధమై శత్రువులను జయించి కీర్తిని సంపాదించు. సిరిసంపదలతో ఉన్న సంపూర్ణ రాజ్యమును అనుభవించు. వీరందరూ కూడా నాచే ముందే చంపబడ్డారు. కాబట్టి నీవు నిమిత్తమాత్రుడవుగా ఉండు.