శ్లోకం - 55
మత్కర్మకృన్మత్పరమః మద్భక్తస్సంగవర్జితః | నిర్వైరస్సర్వభూతేషు యస్స మామేతి పాండవ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, నా కోసం కర్తవ్యకర్మలను చేస్తూ, నన్ను పరమాత్మగా భావించి, నాయందు భక్తిశ్రద్ధలు కలిగి, ప్రాపంచిక కోరికల మీద ఆసక్తి లేనివాడై మరియు ఏ ప్రాణి పట్లా శత్రుత్వం లేనివాడైన పరమ భక్తుడు నన్ను చేరుకుంటాడు.