శ్లోకం - 7

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ | భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును స్థిరంగా నా యందే నిలిపిన అలాంటి పరమ భక్తులను త్వరగానే అనుగ్రహించి మృత్యు రూపమైన సంసార సాగరం నుండి విముక్తి కలిగిస్తాను.