శ్లోకం - 15

యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః | హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరిని చూసి లోకము భయపడదో, లోకమును చూసి ఎవరైతే భయపడడో మరియు సంతోషము, కోపము, భయము, ఆవేశములకు గురికాకుండా ఉండే వాడు నాకు ఎంతో ప్రియుడు.