శ్లోకం - 16

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః | సర్వారంభపరిత్యాగీ యో మద్భక్త స్స మే ప్రియః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక కోరికల మీద ఆసక్తి లేనివాడు, మనస్సు, వాక్కు, శరీరము ద్వారా పవిత్రతను పొందినవాడు, పనులను సమర్ధవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం కలవాడు, ఎలాంటి పక్షపాతములు లేనివాడు, చీకుచింతా లేనివాడు, దుఃఖములకు కలతచెందనివాడు మరియు సమస్త కర్మలను త్యాగం చేసినవాడైన నా భక్తుడు నాకు చాలా ప్రియుడు.