శ్లోకం - 5

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ | బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్షేత్రము, క్షేత్రజ్ఞుల తత్త్వములను గురించి ఋషులు చేత ఎన్నో విధాలుగా చెప్పబడినది. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది చెప్పబడినది. బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా చెప్పబడినది.