శ్లోకం - 26

అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే | తే௨పి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని కొంత మంది తత్వజ్ఞానుల దగ్గర విని భగవంతుడిని సేవించటం మొదలుపెడతారు. ఈ విధముగా భక్తిశ్రద్ధలతో పూజించు వారు కూడా సంసార సాగరమైన జనన మరణ చక్రము నుండి విముక్తులై ముక్తిని పొందుతున్నారు.