శ్లోకం - 34
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః | క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ సమస్త లోకమును ప్రకాశింపచేస్తున్నట్లు, ఒక్క ఆత్మనే శరీరము అంతటిని ప్రకాశింపచేస్తుంది.