శ్లోకం - 14
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ | తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు.