శ్లోకం - 19
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి | గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో௨ధిగచ్ఛతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జగత్తులోని సమస్త మానవులు ఈ మూడు గుణముల బంధనములో ఉంటారు. కాబట్టి ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ, సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు. కాబట్టి, ఆయనను త్రి-గుణాతీతుడు (భౌతిక ప్రకృతి యొక్క గుణములకు అతీతుడు) అని అంటారు. గుణాలకు అతీతుడైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వివేకి మోక్షం పొందుతాడు.