శ్లోకం - 23

ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే | గుణా వర్తంత ఇత్యేవ యో௨వతిష్ఠతి నేఙ్గతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణముల వలన చలించకుండా, సర్వ కార్యాలలోనూ ప్రకృతి గుణములే ప్రవర్తిస్తున్నాయని తెలుసుకుని, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చలబుద్ధిని విడిచి పెట్టనివాడు త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.