శ్లోకం - 6
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః | యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: స్వయంప్రకాశితమైన ఆ పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింప చేయలేవు. అట్టి పరంధామము నా యొక్క ఉత్తమమైన ధామమని తెలుసుకొనుము. ఆ పరంధామమును చేరిన జీవులు సంసార బంధము నుండి విముక్తి పొంది మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.