శ్లోకం - 14
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను వైశ్వానరుడు అనే జఠరాగ్ని(ఆహారమును జీర్ణము చేసే అగ్ని) రూపములో సర్వ ప్రాణుల శరీరములలో ఉండి ప్రాణాపానవాయువులతో(బయటకువెళ్ళే మరియు లోనికి వచ్చే శ్వాస) కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.