శ్లోకం - 11
చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః | కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు మరణించు సమయం వరకు కూడా అంతులేని ఆందోళనలతో సతమతమై పోతుంటారు. ప్రాపంచిక సుఖములే ఉత్తమమైనవని భావించి అదియే నిజమైన సంతోషమని నమ్ముతారు.